ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బంజారా ధూప దీప నైవేద్య అర్చక సంఘం నూతన కమిటీ ఎన్నిక..
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బంజారా ధూప దీప నైవేద్య అర్చక సంఘం నూతన కమిటీ ఎన్నిక
ఎస్ ఆర్ ఎస్ న్యూస్...
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బంజారా ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా స్థాయి సమావేశం నిర్వహించి, నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అర్చకులను కీలక బాధ్యతల్లోకి నియమించారు. నియామకాల వివరాలు: కామారెడ్డి జిల్లా అధ్యక్షులు: పూల మహారాజ్ కామారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు: సూర్య మహారాజ్ (కొండాపూర్) నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు: రామచందర్ మహారాజ్ (డిచ్పల్లి) నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు: మురళి మహారాజ్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు:రమేష్ మహారాజ్ (యాచారం తండా) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్:బాల బ్రహ్మచారి, రమేష్ మహారాజ్ (యాచారం తండా)ను తెలంగాణ రాష్ట్ర బంజారా ధూప దీప నైవేద్య అర్చక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. అలాగే, తెలంగాణ రాష్ట్ర బంజారా ధూప దీప నైవేద్య అర్చక సంఘం కమిటీలో నిజామాబాద్ జిల్లా నుండి ముగ్గురు ప్రతినిధులను రాష్ట్ర స్థాయి సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. వీరిలో శత్రు మహారాజ్ (ఎల్లమ్మ గుట్ట), సూర్య మహారాజ్ (నవీపేట్), ప్రేమ్ దాస్ మహారాజ్ మరియు శంకర్ మహారాజ్ (భీమ్గల్) ఉన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు మాట్లాడుతూ, బంజారా సంప్రదాయాలను, ధూప దీప నైవేద్య వ్యవస్థను కాపాడటంలో మరియు అర్చకుల సంక్షేమం కోసం తమవంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. సంఘం బలోపేతానికి అందరూ ఐక్యంగా పని చేస్తామని వారు తెలిపారు.