© 2026 SRS News. All rights reserved.
Developed by Abhiram

నిజామాబాద్: సమాచారాన్ని ఇవ్వని అధికారులపై రాష్ట్ర కమిషన్కు ఫిర్యాదు చేసినచో ప్రతిరోజు 250/- చొప్పున 25 వేల వరకు జరిమానా... నిజామాబాద్ పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో సమాచార హక్కు చట్టం 2005 పైన అవగాహన కార్యక్రమం నిజామాబాద్ జిల్లా కార్యవర్గం సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది.ఇట్టి కార్యక్రమానికి సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ మాజీ ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి ఎంఏ సలీం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా నిజామాబాద్ జిల్లా అధ్యక్షులుగా కాంతపు గంగాధర్, మహిళ అధ్యక్షురాలుగా వై సునీత, న్యాయ విభాగ సలహాదారులుగా శ్యామల, జిల్లా కార్యదర్శిగా రషీద, ముఖ్య సలహాదారులుగా మహమ్మద్, బోధన్ డివిజన్ అధ్యక్షురాలిగా తస్లీమ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అనంతరం సమాచార హక్కు చట్టం 2005 పేద ప్రజలకు ఒక వజ్రాయుధం లాంటిదని సలీం అన్నారు.రాష్ట్ర స్పోక్స్ పర్సన్ న్యాయవాది శ్రీనివాసరావు మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు బోర్డులను ఏర్పాటు చేసి అధికారులకు శిక్షణ తరగతులు ఇచ్చి తదితర అవినీతిలు జరిగిన ఆరోపణలపై దర్యాప్తు చేసి తగిన సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. సమాచార హక్కు చట్టం 2005 పరిధిని అంతర్జాతీయ స్థాయిలో విస్తరించాలని ఇక శ్రీనివాసరావు న్యాయవాది కోరారు. అలాగే సమాచార హక్కు చట్టం 2005 దరఖాస్తు విధానాన్ని సెక్షన్ 6(1) మరియు సెక్షన్ 19(1) రెండవ పిల్ 19 (3 )మరియు సమాచారాన్ని ఇవ్వని అధికారులపై రాష్ట్ర కమిషన్కు ఫిర్యాదు చేసినచో ప్రతిరోజు 250/- చొప్పున 25 వేల వరకు జరిమానా విధించే అధికారం రాష్ట్ర సమాచార కమిషన్కు ఉంటుందని తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కాంతపూ గంగాధర్, మహిళా అధ్యక్షురాలు వై సునీత న్యాయ విభాగ సలహాదారులు శ్యామల,జిల్లా మహిళా కార్యదర్శి రషీద బోధన్ డివిజన్ అధ్యక్షురాలు తస్లీమ్ సహచట ప్రతినిధులు జాబిద్ అన్వర్, గౌరీ శ్రీనివాస్, టీ నరసింహ చారి మరియు ఉత్సాహవంతులు తదితరులు పాల్గొన్నారు.

నిజామాబాద్ • 5 నెలల క్రితం23

నిజామాబాద్ • ఒక రోజు క్రితం13

నిజామాబాద్ • 6 నెలల క్రితం35

నిజామాబాద్ • 8 నెలల క్రితం9

నిజామాబాద్ • సుమారు 2 నెలల క్రితం20