© 2026 SRS News. All rights reserved.
Developed by Abhiram
నిజామాబాద్: బిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు జన్మదిన సందర్బంగా ఆర్మూర్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పండ్ల పంపిణి.. ఎస్ ఆర్ ఎస్ న్యూస్ ఆర్మూర్.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి లో బిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు జన్మదిన సందర్బంగా ఆర్మూర్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పండ్ల పంపిణి* భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీ స్థాపక అధ్యక్షులు,తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు జన్మదిన సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి పార్టీ ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు పూజ నరేందర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్ర చారిత్రాత్మకమని, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం ఆయన చూపిన దారిలోనే ముందుకు సాగుతామని పేర్కొన్నారు. ఆర్మూర్ పట్టణంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించి,పార్టీ శ్రేణులు ఒకరికి ఒకరు మిఠాయిలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.కేసీఆర్ ఆరోగ్యంగా,దీర్ఘాయుష్షుతో ఉండాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఇట్టి కార్యక్రమం లో బిఅర్ఎస్ కౌ న్సిలర్ లు నాదీమ్,పృద్వి,అజిమ్, సీనియర్ నాయకులు సుంకరి రవి, మీరా శ్రవణ్, మందుల పోశెట్టి, ఎస్ ఆర్ రమేష్, బి.అర్.ఎస్.పార్టీ ఆర్మూర్ మండల యువజన అధ్యక్షులు అగ్గు క్రాంతి టౌన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు జన్నెపల్లి రంజిత్ మైనార్టీ నాయకులు మాలిక్ బాబా, ఆరిఫ్ ఖాన్, ఖరీం నాయకులు ఎం జె రామ్, కళ్యాణ్ పాల్గొన్నారు.
నిజామాబాద్ • 5 రోజుల క్రితం32
నిజామాబాద్ • 19 రోజుల క్రితం62
నిజామాబాద్ • సుమారు 17 గంటల క్రితం1
నిజామాబాద్ • 12 రోజుల క్రితం25
నిజామాబాద్ • 20 రోజుల క్రితం29