మెట్పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి కి ఘన సన్మానం...
Ad
మీ బ్రాండ్..
ప్రతి ఇంటా ప్రతిధ్వనించాలి!
ప్రకటనల కోసం ఈరోజే సంప్రదించండి.
మెట్పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి కి ఘన సన్మానం...
ఎస్ ఆర్ ఎస్ న్యూస్: కామారెడ్డి..
కామారెడ్డి పట్టణంలో నేడు మెట్పల్లి మున్సిపల్ చైర్మన్ మరియు జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు మైలారపు లింబాద్రి ని ఆర్యవైశ్య ప్రముఖులు ఆత్మీయంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కైలాస్ శ్రీనివాస్ రావు, తెలంగాణ ఆర్యవైశ్య ఉపాధ్యక్షులు మరియు ఆర్యవైశ్య మహాసభ రీజినల్ చైర్మన్ శనిశెట్టి గౌరీశంకర్, కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య యువజన అధ్యక్షులు పెన్సిల్వార్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆర్యవైశ్య సంఘం బలోపేతానికి, సమాజ హితానికి మైలారపు లింబాద్రి చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధిగా ఆయన చేపడుతున్న అభివృద్ధి పనులను, సంఘం పట్ల ఆయనకున్న నిబద్ధతను వారు కొనియాడారు. అనంతరం మైలారపు లింబాద్రి ని శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు మరియు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.