ఆర్మూర్ ప్రజలు ఆవేశానికి లోనుకావద్దు.. శాంతిని కాపాడుకుందాం: ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి విజ్ఞప్తి..
Ad
మీ బ్రాండ్..
ప్రతి ఇంటా ప్రతిధ్వనించాలి!
ప్రకటనల కోసం ఈరోజే సంప్రదించండి.
ఆర్మూర్లో మత సామరస్యానికి విఘాతం కలిగిస్తున్నారు: ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి..
ఎస్ ఆర్ ఎస్ న్యూస్ :కామారెడ్డి..
ఆర్మూర్ నియోజకవర్గంలో ఎంఐఎం (MIM), కాంగ్రెస్ పార్టీలు అనవసరంగా మత రంగు పులిమి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాయని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం కామారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మత మార్పిడి కుట్రలు:పెర్కిట్ గ్రామంలోని ఒక పాఠశాలలో హిందూ విద్యార్థులకు బలవంతంగా నమాజ్ చేయించడం, మత మార్పిడికి ప్రయత్నించడం దుర్మార్గమని ఎమ్మెల్యే విమర్శించారు. ఆ పాఠశాల ప్రిన్సిపాల్ ఇమ్రాన్ ఖాన్కు ఐఎస్ఐ (ISI)తో సంబంధాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. తల్లిదండ్రుల అంగీకారం లేకుండా పిల్లలతో నమాజ్ చేయించడం వెనుక విదేశీ శక్తుల నిధులు ఉన్నాయని, హిందువులను మత మార్పిడి చేయడమే లక్ష్యంగా కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. బాహ్య శక్తుల ప్రమేయం: హైదరాబాద్ నుండి కొందరు గుండాలు ఆర్మూర్ వచ్చి గొడవలు సృష్టించేందుకు యత్నిస్తున్నారని, ఎంఐఎం పార్టీ మతం ముసుగులో గొడవలను ప్రేరేపిస్తోందని రాకేష్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలకు విజ్ఞప్తి: జరిగిన చిన్నపాటి గొడవను అనవసరంగా పెద్దది చేస్తున్నారని, ఆర్మూర్ ప్రజలు, యువత ఆవేశాలకు లోనుకావద్దని ఆయన కోరారు. హిందూ, ముస్లింలు అందరూ అన్నదమ్ములని, సంఘ విద్రోహ శక్తుల మాటలు నమ్మవద్దని సూచించారు. సామరస్యంగా పరిష్కరించుకుందాం:ముస్లిం పెద్దలు, హిందూ నాయకులు కూర్చుని పరస్పరం సామరస్యంగా మాట్లాడుకుందామని, గొడవలకు తావు లేకుండా ఆర్మూర్ను ప్రశాంతంగా ఉంచుకుందామని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.