© 2026 SRS News. All rights reserved.
Developed by Abhiram
కామారెడ్డి: బాన్సువాడ పట్టణంలో ప్రస్తుతం పూర్తిగా ప్రశాంత వాతావరణం నెలకొని ఉంది. నిన్న జరిగిన సంఘటనపై ఇప్పటికే కేసులు నమోదు చేసి, దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. ఈ సంఘటనలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ గుర్తించి, వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.పట్టణంలోని ఇరు వర్గాల పెద్దలు ముందుకు వచ్చి మతసామరస్యాన్ని కాపాడేందుకు సహకరిస్తుండటం అభినందనీయం. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని,ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్త చర్యగా అదనపు పోలీసు బలగాలను ఏర్పాటు చేయడం జరిగింది.జిల్లా యంత్రాంగం నిరంతరం పరిస్థితులను పర్యవేక్షిస్తోంది. ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమనగా,సోషల్ మీడియా వేదికలైన వాట్సాప్, ట్విట్టర్,ఇన్స్టాగ్రామ్ లేదా ఇతర మాధ్యమాలలో మతసామరస్యాన్ని దెబ్బతీసే విధంగా,విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా లేదా అసత్య వదంతులను వ్యాప్తి చేసే పోస్టులు చేయరాదు.అలాంటి చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు అని జిల్లా ఎస్పీ తెలిపారు.వదంతులను నమ్మకుండా,అధికారిక సమాచారం కోసం మాత్రమే పోలీసు శాఖను నమ్మాలని కోరుతున్నాము.పోలీసు శాఖ మరియు జిల్లా యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉంది. ప్రజలు ఎటువంటి భయాందోళనలు లేకుండా తమ దైనందిన కార్యకలాపాలను యథావిధిగా కొనసాగించవచ్చు.మతసామరస్యాన్ని భంగం కలిగించే లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయి. శాంతి, సామరస్య పరిరక్షణలో ప్రజల సహకారం అత్యంత ముఖ్యమని జిల్లా పోలీసు శాఖ విజ్ఞప్తి చేస్తోంది.
కామారెడ్డి • 2 రోజుల క్రితం23
కామారెడ్డి • 4 రోజుల క్రితం62
కామారెడ్డి • 4 రోజుల క్రితం24
కామారెడ్డి • సుమారు 15 గంటల క్రితం24
కామారెడ్డి • ఒక రోజు క్రితం422