ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్...
Ad
మీ బ్రాండ్..
ప్రతి ఇంటా ప్రతిధ్వనించాలి!
ప్రకటనల కోసం ఈరోజే సంప్రదించండి.
ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్...
పాల్వంచ పీపీసీని సందర్శించిన కలెక్టర్...
లారీ లోడింగ్ ప్రక్రియ పరిశీలన...
రైతులకు ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులు కల్పించాలని ఆదేశం....
ఎస్ ఆర్ ఎస్ న్యూస్ : కామారెడ్డి జిల్లా బ్యూరో...
పాల్వంచ మండలంలోని పీఏసీఎస్ మాచారెడ్డి పరిధిలో కొనసాగుతున్న పాల్వంచ వరి కొనుగోలు కేంద్రాన్ని (పీపీసీ) మంగళవారం జిల్లా కలెక్టర్ సందర్శించారు. కేంద్రంలో జరుగుతున్న ధాన్యం కొనుగోలు తీరును,లోడింగ్ ప్రక్రియను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సంబంధిత అధికారులకు (డీసీవో, డీఎంసీఎస్, డీసీఎస్ఓ) పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. వేగవంతమైన తూకం:వరి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి, రైతుల ధాన్యాన్ని త్వరితగతిన సేకరించాలి. రవాణా సౌకర్యాలు: సరిపడా వాహనాలను ఏర్పాటు చేసి, రైస్ మిల్లుల వద్ద అన్లోడింగ్ ప్రక్రియ ఆలస్యం కాకుండా చూడాలి. నాణ్యత ప్రమాణాలు: ధాన్యం సేకరణ పూర్తిగా ఎఫ్ఏక్యూ (FAQ) నిబంధనల ప్రకారం జరగాలి. కొనుగోలు వివరాలను వెంటనే 'ధాన్యసేతు' యాప్లో నమోదు చేయడంతో పాటు రిజిస్టర్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి. ట్యాబ్ ఎంట్రీలు: అన్లోడింగ్ పూర్తయిన వెంటనే ట్రక్ చిట్స్ సేకరించి, ట్యాబ్ ఎంట్రీలను ఎటువంటి ఆలస్యం లేకుండా పూర్తి చేయాలి. రక్షణ చర్యలు: అకాల వర్షాల ముప్పు ఉన్నందున, తూకం వేసిన ధాన్యం మరియు కుప్పలు తడవకుండా టార్పాలిన్లు కప్పి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులు కల్పించాలని, కేటాయించిన రైస్ మిల్లులకు మాత్రమే ధాన్యాన్ని తరలించాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ), డీసీవో, డీసీఎస్ఓ,డీఎంసీఎస్, ఎంఎస్ఓ, ఫీల్డ్ ఆఫీసర్,తహసీల్దార్, డీటీసీఎస్, ఏఈఓ, సర్పంచ్,కార్యదర్శి,పీపీసీ సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు.