మంత్రి సీతక్క కాన్వాయ్ ను అడ్డుకున్న బిఆర్ఎస్ కార్యకర్తలపై కేసు నమోదు...

Ad
మీ బ్రాండ్..
ప్రతి ఇంటా ప్రతిధ్వనించాలి!
ప్రకటనల కోసం ఈరోజే సంప్రదించండి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా,స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి డా.ధనసరి అనసూయ సీతక్కగారు ప్రభుత్వ కార్యక్రమాలలో భాగంగా ఈ రోజు కామారెడ్డి జిల్లా పర్యటనకు విచ్చేశారు.అనంతరం సిరికొండ మండలం పాకల్ గ్రామంలో మాలవత్ పూర్ణ ని పరామర్శించడానికి బయలుదేరిన సందర్భంగా,రామారెడ్డి పట్టణంలోని అయోధ్య నగర్ వెంచర్ దగ్గర రాజరాజేశ్వరీ కిరాణం ముందు కొంతమంది BRS కార్యకర్తలు రైతుల ముసుగులో మంత్రిగారి కాన్వాయ్ ముందుకు అకస్మాత్తుగా వచ్చి అడ్డుకున్నారు.దీంతో ప్రమాదం సంభవించే అవకాశం ఉండగా, డ్రైవర్ చాకచక్యంగా బ్రేక్ వేయడంతో ప్రమాదం తప్పింది.డ్యూటీలో ఉన్న సంబంధిత పోలీసు అధికారి దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు, కాన్వాయ్ను అడ్డుకున్న క్రింది వ్యక్తులపై కేసు నమోదు చేయబడింది:
- పడిగల శ్రీనివాస్ – రామారెడ్డి గ్రామం (BRS నాయకుడు)
- నారెడ్డి దశరథ్ రెడ్డి – మాజీ ఎంపీపీ, పోసానిపేట్ గ్రామం
- కొత్తొల్ల గంగారం – ఉప్పలవాయి గ్రామం (BRS Ex సర్పంచ్ )
- బాలదేవ్ అంజయ్య – రామారెడ్డి గ్రామం
- ద్యాగల మహిపాల్ – BRS నాయకుడు, రామారెడ్డి
- హన్మయల్లా రాజయ్య – రామారెడ్డి గ్రామం..