తొలి సీఎం వారసుడిని మర్యాదపూర్వకముగా కలిసిన కామారెడ్డి వాసి కోడిప్యాక సాయిరాం...
Ad
మీ బ్రాండ్..
ప్రతి ఇంటా ప్రతిధ్వనించాలి!
ప్రకటనల కోసం ఈరోజే సంప్రదించండి.
తొలి సీఎం వారసుడిని మర్యాదపూర్వకముగా కలిసిన కామారెడ్డి వాసి కోడిప్యాక సాయిరాం....
ఎస్ ఆర్ ఎస్ న్యూస్ : కామారెడ్డి/హైదరాబాద్...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, 'ఆంధ్రకేసరి' స్వర్గీయ టంగుటూరి ప్రకాశం పంతులు కుటుంబ వారసులు, ప్రముఖ సినీ గేయ రచయిత మరియు జ్యోతిష్య–వాస్తు పండితులు అయిన టంగుటూరి వెంకట రాందాసు గారిని కామారెడ్డి జిల్లాకు చెందిన కోడిప్యాక సాయిరాం మర్యాదపూర్వకంగా కలిశారు.హైదరాబాద్లోని రాందాసు నివాసంలో జరిగిన ఈ భేటీలో సాయిరాంను ఆయన ఆత్మీయంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారిద్దరూ తెలుగు సాహిత్యం, సాంస్కృతిక అంశాలు మరియు ప్రస్తుత సామాజిక పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం సాయిరాంను రాందాసు నిండు మనసుతో ఆశీర్వదించారు.ఈ సందర్భంగా కోడిప్యాక సాయిరాం మాట్లాడుతూ.."తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుడు ప్రకాశం పంతులు వారసులను కలవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను.రాందాసు చూపిన ఆదరణ,ఆత్మీయత మరువలేనివి.వారిలోని సరళత,సంస్కారం నేటి తరానికిఆదర్శప్రాయం."