న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకుంటే సమ్మె తప్పదు: ఆర్మూర్ మున్సిపల్ కార్మికుల హెచ్చరిక...
Ad
మీ బ్రాండ్..
ప్రతి ఇంటా ప్రతిధ్వనించాలి!
ప్రకటనల కోసం ఈరోజే సంప్రదించండి.
న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకుంటే సమ్మె తప్పదు: ఆర్మూర్ మున్సిపల్ కార్మికుల హెచ్చరిక..
ఎస్ ఆర్ ఎస్ న్యూస్: ఆర్మూర్...
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులు తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం పోరుబాట పట్టారు. బుధవారం (ఈరోజు) మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు భారీ నిరసన చేపట్టారు. తమ సమస్యలపై మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం అందజేయడంతో పాటు, సమ్మె నోటీసును కూడా అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించిన కార్మికులు,నాయకులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. గత 16 నెలలుగా పీఎఫ్ (PF) డబ్బులు పెండింగ్లో ఉన్నాయని, ఈఎస్ఐ (ESI) నిధులు కట్ అవుతున్నా అకౌంట్లలో జమ కావడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
*పెండింగ్ నిధులు: 16 నెలల పీఎఫ్, ఈఆర్సీ (ERC) బకాయిలను వెంటనే చెల్లించాలి. *సిబ్బంది పెంపు: పట్టణం పెరిగినా సిబ్బందిని పెంచకపోవడం వల్ల పని భారం పెరిగి కార్మికులు అనారోగ్యం పాలవుతున్నారు. వెంటనే సిబ్బందిని పెంచాలి. *సెలవు సౌకర్యం: నెలకు కనీసం రెండు రోజులు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి. *పాలకవర్గ స్పందన: మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ మరియు పాలకవర్గం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలి. ఈ నిరసన కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ (MRPS) జిల్లా సీనియర్ నాయకులు ఇందారపు రాజు,బిఎల్ఎఫ్ (BLF) జిల్లా అధ్యక్షులు దండి వెంకటి, కార్మిక సంఘ నాయకులు రాజేందర్, అరవింద్, నరసయ్య తదితరులు పాల్గొన్నారు. కమిషనర్ హామీ: కార్మికుల ఆందోళనపై స్పందించిన మున్సిపల్ కమిషనర్,వారం రోజుల్లోగా మున్సిపల్ చైర్మన్ మరియు కౌన్సిల్ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమై ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.అధికారుల హామీతో కార్మికులు ప్రస్తుతానికి నిరసన విరమించినప్పటికీ,గడువులోగా పరిష్కారం చూపకపోతే సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు.