హెచ్ఐవి నివారణ మనందరి బాధ్యత: మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి..
హెచ్ఐవి నివారణ మనందరి బాధ్యత: మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి..
ఎస్ ఆర్ ఎస్ న్యూస్:కామారెడ్డి..
హెచ్ఐవి నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలో హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణలో భాగంగా ప్రభుత్వ ఆదేశానుసారం చేపట్టిన ఐఐఈసీ (IIEC - తీవ్రతరమైన విజ్ఞాన సమాచారం- అవగాహన) కార్యక్రమాన్ని డిఎంహెచ్ఓ వెంకట్తో కలిసి ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ వెంకట్ మాట్లాడుతూ... హెచ్ఐవి పై విస్తృత ప్రచారంలో భాగంగా రాబోయే రెండు నెలల పాటు జిల్లాలోని వివిధ కేంద్రాలు మరియు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేయనున్నట్లు తెలిపారు. అనంతరం హెచ్ఐవి ప్రమాదాలు, ముందస్తు జాగ్రత్తలు తెలుసుకోవడానికి వీలుగా క్యూఆర్ కోడ్ గోడ పత్రికలను అధికారులు ఆవిష్కరించారు. ఈ పోస్టర్లను సద్వినియోగం చేసుకుని తగిన సేవలు పొందాలని కోరారు. ప్రజలకు ఏవైనా సందేహాలుంటే టోల్ ఫ్రీ నంబర్ 1097 కి డయల్ చేసి నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆర్ఎంఓ రవీందర్ గౌడ్, హెచ్ఐవి నివారణ జిల్లా అధికారి ప్రదీప్ కుమార్, ఏఆర్టీ వైద్యులు స్నేహా, ఆంచల్, వైఆర్జీ కేర్ ఉమ్మడి జిల్లా డీఆర్పీ గర్దాస్ సుధాకర్, కౌన్సిలర్లు మేక నాగరాజు, మిరుదొడ్డి శేఖర్, పాముల లలిత కుమారి, మెహరాజ్, చిరంజీవి, ప్రవీణ్ గౌడ్, ఎస్ఎస్కే మేనేజర్ శ్రీనివాస్ గౌడ్, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.