వెంటనే ఫీజు బకాయిలు చెల్లించాలి: ముఖ్యమంత్రి చిత్రపటాలతో టిఎన్ఎస్ఎఫ్ నిరసన..
Ad
మీ బ్రాండ్..
ప్రతి ఇంటా ప్రతిధ్వనించాలి!
ప్రకటనల కోసం ఈరోజే సంప్రదించండి.
ఫీజు బకాయిల విడుదలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోర వైఫల్యం: టిఎన్ఎస్ఎఫ్ నిరసన..
ఎస్ ఆర్ ఎస్ న్యూస్:కామారెడ్డి..
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలను విడుదల చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు డాక్టర్ బాలు విమర్శించారు. ఫీజు బకాయిలు రాక కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులు సర్టిఫికెట్లు పొందలేక, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు విద్యార్థులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాలకు వినతిపత్రాలు సమర్పిస్తూ నిరసన తెలిపారు. ముఖ్యమంత్రికి బాధ్యత లేదా? ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ, గత మూడు సంవత్సరాలుగా బీసీ విద్యార్థుల ఫీజు బకాయిలను ప్రభుత్వం విడుదల చేయడం లేదని మండిపడ్డారు. విద్యాశాఖ మంత్రి బాధ్యతలు చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, విద్యార్థుల సమస్యలను పట్టించుకోకపోవడం దురదృష్టకరమని అన్నారు. వెంటనే పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలను విడుదల చేసి, విద్యార్థుల విద్యాభవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యార్థి వ్యతిరేక విధానాలు: గత ప్రభుత్వం అనుసరించిన విద్యార్థి వ్యతిరేక విధానాలనే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగిస్తోందని డాక్టర్ బాలు ఆరోపించారు. "ప్రజా పాలన" పేరుతో విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయడం తగదని హెచ్చరించారు. ఫీజు బకాయిలు రాక, సొంతంగా చెల్లించలేక వేలాది మంది విద్యార్థులు ఉన్నత విద్యను, ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, తక్షణమే బకాయిలు చెల్లించి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు.