కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డికి భారీ ఊరట: మూడు క్రిమినల్ కేసులు కొట్టివేత..
Ad
మీ బ్రాండ్..
ప్రతి ఇంటా ప్రతిధ్వనించాలి!
ప్రకటనల కోసం ఈరోజే సంప్రదించండి.
కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డిపై నమోదైన మూడు క్రిమినల్ కేసులు కొట్టివేత**
ఎస్ ఆర్ ఎస్ న్యూస్: కామారెడ్డి..
హైదరాబాద్: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో కామారెడ్డి ఎమ్మెల్యే శ్రీ కాటిపల్లి వెంకటరమణ రెడ్డిపై గతంలో నమోదైన మూడు క్రిమినల్ కేసులను హైదరాబాద్ నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. 2023వ సంవత్సరంలో కామారెడ్డి పట్టణంలో ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్ను నిరసిస్తూ జరిగిన ప్రజా ఆందోళనల్లో ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి పాల్గొన్నారు. ప్రజల ఆస్తులు, రైతుల భూములు, పట్టణ వాసుల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా జరిగిన ధర్నాలు, వంటావార్పు, బతుకమ్మ వేడుకలు, ర్యాలీలు వంటి ప్రజాస్వామ్యబద్ధమైన నిరసన కార్యక్రమాల్లో ఆయన పాల్గొని ప్రజలకు అండగా నిలిచారు. ఈ క్రమంలో స్థానిక పోలీసులు ఆయనపై పలు కేసులు నమోదు చేశారు. ఈ కేసులపై నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. ఎమ్మెల్యే తరఫున అడ్వకేట్లు ఎల్. ప్రభాకర్ రెడ్డి, వై.రాములు,టి. ఉదయ్ రాజ్ వాదనలు వినిపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన ఆందోళనల్లో పాల్గొనడం నేరం కాదని, ప్రజల తరఫున పోరాడటం బాధ్యత అని వారు కోర్టుకు వివరించారు. వాదనలను మరియు కేసులోని అంశాలను సమగ్రంగా పరిశీలించిన గౌరవ న్యాయస్థానం, అభియోగాలను కొనసాగించేందుకు తగిన ఆధారాలు లేవని నిర్ధారిస్తూ, సదరు మూడు కేసులను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. చట్టం ముందు వాస్తవాలు నిలబడ్డాయని, న్యాయస్థానం కల్పించిన ఈ ఉపశమనం ప్రజాస్వామ్య విజయం అని న్యాయవాదులు పేర్కొన్నారు.