వర్షాకాల సన్నద్ధతపై జిల్లా స్థాయి సమీక్ష: మే 18న 'ఫ్లడ్ మాక్ డ్రిల్' నిర్వహణ....
Ad
మీ బ్రాండ్..
ప్రతి ఇంటా ప్రతిధ్వనించాలి!
ప్రకటనల కోసం ఈరోజే సంప్రదించండి.
వర్షాకాల సన్నద్ధతపై జిల్లా స్థాయి సమీక్ష: మే 18న 'ఫ్లడ్ మాక్ డ్రిల్' నిర్వహణ...
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేసిన కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులు...
అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశం...
ఎస్ ఆర్ ఎస్ న్యూస్: కామారెడ్డి జిల్లా బ్యూరో...
కామారెడ్డి: రాబోయే వర్షాకాలాన్ని పురస్కరించుకుని వరదల నివారణ,విపత్తు నిర్వహణపై ఢిల్లీ నుండి కేంద్ర విపత్తు నిర్వహణ సంస్థ (NDMA) మేజర్ జనరల్ బహల్, డీజీ ఫైర్ సర్వీసెస్ విక్రమ్ సింగ్ మాన్ (IPS) మరియు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.ఈ సమావేశంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ జిల్లా అధికారులతో కలిసి పాల్గొన్నారు. జిల్లా స్థాయి సమీక్ష: వరదల సమయంలో ముందస్తు జాగ్రత్తలు, చేపట్టాల్సిన సహాయక చర్యలు మరియు వివిధ శాఖల మధ్య సమన్వయంపై కలెక్టర్ సమీక్షించారు. ఫ్లడ్ మాక్ ఎక్సర్సైజ్ (మే 18): విపత్తులను ఎదుర్కోవడంలో సన్నద్ధతను పరీక్షించేందుకు 2026 మే 18న జిల్లా వ్యాప్తంగా 'ఫ్లడ్ మాక్ ఎక్సర్సైజ్' నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. పాల్గొనే శాఖలు: ఈ మాక్ డ్రిల్లో రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక, వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్, ఇరిగేషన్, మున్సిపల్, విద్యుత్ మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖలు భాగస్వామ్యం కానున్నాయి.అత్యవసర సమయాల్లో ప్రజల తరలింపు, రక్షణ చర్యలు, కమ్యూనికేషన్ వ్యవస్థల పనితీరును మెరుగుపరచడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం. మే 18న నిర్వహించేది కేవలం సన్నద్ధత కోసం చేసే నమూనా ప్రదర్శన (Mock Exercise) మాత్రమే. కావున జిల్లా ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని, ఇది ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించే అధికారిక కార్యక్రమమని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.