కామారెడ్డిలో హైవే బస్టాండ్ ఏర్పాటు చేయండి: మంత్రి పొన్నం ప్రభాకర్ కు కాంగ్రెస్ నేతల విజ్ఞప్తి..
Ad
మీ బ్రాండ్..
ప్రతి ఇంటా ప్రతిధ్వనించాలి!
ప్రకటనల కోసం ఈరోజే సంప్రదించండి.
కామారెడ్డిలో హైవే బస్టాండ్ ఏర్పాటు చేయండి: మంత్రి పొన్నం ప్రభాకర్ కు కాంగ్రెస్ నేతల విజ్ఞప్తి..
సానుకూలంగా స్పందించిన రవాణా శాఖ మంత్రి..
స్థల పరిశీలన చేయాలని కలెక్టర్, ఆర్టీసీ ఎండీకి ఆదేశం..
ఎస్ ఆర్ ఎస్ న్యూస్ : హైదరాబాద్/కామారెడ్డి...
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రయాణికుల సౌకర్యార్థం జాతీయ రహదారి పక్కన (హైవే) ప్రత్యేక బస్టాండ్ ఏర్పాటు చేయాలని కోరుతూ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకుల బృందం మంగళవారం రాష్ట్ర రవాణా & బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.ప్రయాణికుల ఇబ్బందులను వివరించిన గడ్డం చంద్రశేఖర్ రెడ్డి. ఈ సందర్భంగా గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. కామారెడ్డి పట్టణం లక్షకు పైగా జనాభాతో ఉత్తర తెలంగాణలో కీలక పట్టణంగా విస్తరిస్తోందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఉన్న బస్టాండ్ విస్తీర్ణం తక్కువగా ఉండటం, పట్టణం నలువైపులా పెరుగుతుండటంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు.ముఖ్యంగా 44వ జాతీయ రహదారి మీదుగా వెళ్లే నిజామాబాద్, ఆర్మూర్, ఆదిలాబాద్, నిర్మల్, నాగ్ పూర్ మరియు కోరుట్ల ప్రాంతాల బస్సులు పట్టణంలోకి రాకపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 44వ జాతీయ రహదారి పక్కన ప్రభుత్వానికి/ఆర్టీసీకి అనుకూలమైన భూమి అందుబాటులో ఉంది.అక్కడ హైవే బస్టాండ్ నిర్మిస్తే ఎక్స్ప్రెస్ మరియు నాన్-స్టాప్ బస్సులు ఆగడానికి వీలుంటుంది.దీనివల్ల ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక వెళ్లే ప్రయాణికులకు రాకపోకలు సులభతరం అవుతాయి.మంత్రి ఆదేశాలు:కాంగ్రెస్ నేతల విజ్ఞప్తిపై మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్పందించారు. కామారెడ్డిలో నూతన బస్టాండ్ ఏర్పాటుకు ఉన్న సాధ్యసాధ్యాలను పరిశీలించాలని, స్థల కేటాయింపు విషయంలో చర్యలు తీసుకోవాలని టీఎస్ఆర్టీసీ ఎండీ మరియు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ను మంత్రి ఆదేశించారు. మంత్రిని కలిసిన వారిలో అడ్లూర్ కౌన్సిలర్ గడ్డమిది మహేష్, డీసీసీ ఉపాధ్యక్షులు నిమ్మ విజయ్ కుమార్ రెడ్డి, క్రెడా అధ్యక్షులు గణగోన లక్ష్మి నర్సాగౌడ్, కాంగ్రెస్ నేత శ్రీధర్ రావ్ తదితరులు ఉన్నారు.