హిందూ స్మశాన వాటిక నిర్మాణ పనులకు మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవ ఆమోదం...
Ad
మీ బ్రాండ్..
ప్రతి ఇంటా ప్రతిధ్వనించాలి!
ప్రకటనల కోసం ఈరోజే సంప్రదించండి.
ఎస్.ఆర్. ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్మశాన వాటిక నిర్మాణం.. కౌన్సిల్ కీలక నిర్ణయం
మున్సిపల్ సాధారణ సమావేశంలో కీలక తీర్మానం.. స్మశాన వాటిక పనులకు గ్రీన్ సిగ్నల్..
ఎస్ ఆర్ ఎస్ న్యూస్: కామారెడ్డి పట్టణం..
స్థానిక మున్సిపల్ సాధారణ సమావేశంలో హిందూ స్మశాన వాటిక (8వ వార్డ్) నిర్మాణ పనులకు సంబంధించిన అజెండా అంశానికి కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. గురువారం మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ అధ్యక్షతన ఈ సాధారణ సమావేశం అత్యంత సౌహార్దపూర్వక వాతావరణంలో జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా స్మశాన వాటిక నిర్మాణ పనులను 'ఎస్.ఆర్. ఫౌండేషన్' ద్వారా చేపట్టే ప్రతిపాదనపై సభ్యులందరూ సుదీర్ఘంగా చర్చించారు. ప్రజా ప్రయోజనాలను, స్థానిక ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, సదరు నిర్మాణ పనులను ఎస్.ఆర్. ఫౌండేషన్కు అప్పగించేందుకు కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్పర్సన్ మాట్లాడుతూ.. కౌన్సిల్ తీసుకున్న ఈ నిర్ణయంతో హిందూ స్మశాన వాటిక నిర్మాణ పనులకు మార్గం సుగమమైందని, త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఈ స్మశాన వాటిక అభివృద్ధి ద్వారా స్థానిక ప్రజలకు అన్ని రకాల మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయని సమావేశ వర్గాలు పేర్కొన్నాయి. ఈ కీలక సమావేశంలో అడిషనల్ కలెక్టర్ గీరి, మున్సిపల్ కమిషనర్ పర్వతాలు, కో-ఆప్షన్ సభ్యులు గొనె సునీత శ్రీనివాస్, అలీ బిన్ అబ్దుల్లా, అస్మా ముబాషీర్ పాల్గొన్నారు. అలాగే కౌన్సిలర్లు షేరు, అంజాద్, మహేష్, జావీద్, నిట్టు గంగాధర్, మోతిలాల్, వాజీద్, సుల్తానా ఆన్వార్, వనిత రామ్మోహన్, కాళ్ళ రాజమణి గణేష్, తహశీనున్నిసా లడ్డు, తాటి లావణ్య ప్రసాద్, లలిత చిట్టి బాబు, అర్షిత, సావిత్రి సత్యం, సుల్తానా బేగం యునుస్, సుల్తానా సిద్దిక్, అఖిల, మరియు బిఆర్ఎస్ (BRS), బిజెపి (BJP) పార్టీలకు చెందిన కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.