నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం....
నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం..
ఎస్ ఆర్ ఎస్ న్యూస్ : హైదరాబాద్...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. భాస్కరరావు రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన నాయకుడని ముఖ్యమంత్రి కొనియాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. శాసనసభ్యుడిగా,మంత్రిగా, పార్లమెంటు సభ్యుడిగా నాదెండ్ల భాస్కరరావు అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు.తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అనేక ప్రజాహిత కార్యక్రమాల్లో వారు చురుకైన పాత్ర పోషించారని తెలిపారు.వారి మరణం పట్ల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ముఖ్యమంత్రి, ఈ కష్ట సమయంలో వారికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని, మృతుని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.