© 2026 SRS News. All rights reserved.
Developed by Abhiram
కామారెడ్డి: ప్రముఖ వ్యాపారవేత్త చాట్ల శ్రీశైలం కు నివాళులర్పించిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ.. ఎస్ ఆర్ ఎస్ న్యూస్, కామారెడ్డి జిల్లా:12 మార్చి, 2026.. ప్రముఖ వ్యాపారవేత్త చాట్ల శ్రీశైలం గారికి నివాళులర్పించిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ! కామారెడ్డి పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, నిస్వార్థ సామాజిక సేవకుడు చాట్ల శ్రీశైలం ఇటీవల స్వర్గస్తులైన నేపథ్యంలో, గురువారం నిర్వహించిన వారి 'పెద్దకర్మ' కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ హాజరై ఘన నివాళులర్పించారు.కామారెడ్డి పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న షబ్బీర్ అలీ,తొలుత చాట్ల శ్రీశైలం గారి చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఈ కష్ట సమయంలో వారికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ: "చాట్ల శ్రీశైలం గారు కామారెడ్డి పట్టణంలో కేవలం ఒక ప్రముఖ వ్యాపారవేత్తగానే కాకుండా, తన దాతృత్వ స్వభావంతో ఎంతోమందికి ఉపాధి కల్పించిన గొప్ప వ్యక్తిగా గుర్తింపు పొందారు. తన వ్యాపార సంస్థల ద్వారా జిల్లా వ్యాప్తంగా వేలాది కుటుంబాలకు జీవనోపాధిని అందిస్తూ, సమాజ శ్రేయస్సు కోరిన వ్యక్తి ఆయన."అదేవిధంగా, సామాజిక సేవా కార్యక్రమాల్లో శ్రీశైలం ఎల్లప్పుడూ ముందుండేవారని, ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడంలో వెనుకాడని మంచి మనసున్న వ్యక్తిని జిల్లా కోల్పోవడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీశైలం గారి మృతి వారి కుటుంబానికే కాకుండా, ఆయన సంస్థలతో అనుబంధం ఉన్న వేలాది కుటుంబాలకు తీరని లోటని పేర్కొన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, శోకసప్తప్త కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, సామాజికవేత్తలు మరియు పెద్ద సంఖ్యలో స్థానికులు పాల్గొని శ్రీశైలం గారికి నివాళులర్పించారు.
కామారెడ్డి • సుమారు 17 గంటల క్రితం24
కామారెడ్డి • 2 రోజుల క్రితం18
కామారెడ్డి • 5 రోజుల క్రితం35
కామారెడ్డి • 5 రోజుల క్రితం59
కామారెడ్డి • సుమారు 11 గంటల క్రితం13