శ్రీ స్వయంభూ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో సోదర ప్రేమను చాటుకున్న ఓదెల నరేష్
Ad
మీ బ్రాండ్..
ప్రతి ఇంటా ప్రతిధ్వనించాలి!
ప్రకటనల కోసం ఈరోజే సంప్రదించండి.
శ్రీ స్వయంభూ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో సోదర ప్రేమను చాటుకున్న ఓదెల నరేష్
ఎస్ ఆర్ ఎస్ న్యూస్ కరీంనగర్ జిల్లా..,
గర్శకుర్తి (గంగాధర): మండల పరిధిలోని గర్శకుర్తి గ్రామంలో కొలువుదీరిన కోరిన కోర్కెలు తీర్చే దైవం శ్రీ స్వయంభూ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల సందర్భంగా కరీంనగర్ జిల్లా వికలాంగుల సంఘం అధ్యక్షులు ఓదెల నరేష్ తన తమ్ముడు వెంకటేష్ మరియు చెల్లెలు స్రవంతిల పట్ల తనకున్న అపారమైన అనురాగాన్ని చాటుకున్నారు. తన ఆహ్వానం మేరకు గ్రామానికి విచ్చేసిన తమ్ముడు, చెల్లెలితో కలిసి నరేష్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం భక్తిశ్రద్ధలతో వారికి స్వామివారి శేష వస్త్రం కప్పి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఓదెల నరేష్ మాట్లాడుతూ:"నేను పిలువగానే మా గ్రామానికి విచ్చేసిన నా తమ్ముడు వెంకటేష్, చెల్లె స్రవంతిలకు హృదయపూర్వక ధన్యవాదాలు. వారిద్దరూ తమ కుటుంబాలతో ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, వారి భావి జీవితం ఉన్నతంగా సాగాలని ఆ వేంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను," అని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.