© 2026 SRS News. All rights reserved.
Developed by Abhiram
కామారెడ్డి: మెజార్టీ సర్పంచ్ స్థానాల్లో విజయం సాధించాలని బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు.కామారెడ్డి నియోజకవర్గంలో మొదటి విడతలో జరగనున్న సర్పంచ్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలలో విజయం సాధించాలని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలోని దోమకొండ, మాచారెడ్డి,బిక్కనూర్,రాజంపేట,పాల్వంచ, బిబిపేట్, రామారెడ్డి మండలాల బిఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు, తన స్వగృహంలో జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగడుతూ ప్రచారం నిర్వహించాలని అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను ప్రజల ముందు పెడుతూ మద్దతు కూడా కట్టాలని సూచించారు.ఎక్కడ కూడా అశ్రద్ధ చేయకుండా గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన పోరాడాలని అన్నారు.ఈ సమావేశంలో బిఆర్ఎస్ సినియర్ నాయకులు ప్రేమ్ కుమార్,మినుకూరి రామ్ రెడ్డి, గోపి గౌడ్,పార్టీ అధ్యక్షులు బాలచంద్రన్, మధుసూదన్, బలవంత్ రావు,రాజా గౌడ్ బాలమని,గూడెం బాలరాజ్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి • 8 రోజుల క్రితం77

కామారెడ్డి • 9 రోజుల క్రితం70

కామారెడ్డి • 4 రోజుల క్రితం23

కామారెడ్డి • 8 రోజుల క్రితం70

కామారెడ్డి • 5 రోజుల క్రితం39