ఇంధన సరఫరాపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం – ప్రధాని మోదీకి వివరించిన సీఎం రేవంత్ రెడ్డి.....
ఇంధన సరఫరాపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం – ప్రధాని మోదీకి వివరించిన సీఎం రేవంత్ రెడ్డి..
ఎస్ ఆర్ ఎస్ న్యూస్ : హైదరాబాద్
ఇంధన సరఫరాపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం – ప్రధాని మోదీకి వివరించిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ మరియు గ్యాస్ సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న సీఎం, రాష్ట్రంలోని పరిస్థితులను క్షుణ్ణంగా వివరించారు. ప్రధానాంశాలు: *ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) ఆధ్వర్యంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించి, ఇంధన సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు సీఎం తెలిపారు. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఈ పర్యవేక్షణ కొనసాగుతోంది. *నిల్వల వివరాలు: తెలంగాణలో సాధారణంగా రోజుకు 36,189 కిలో లీటర్ల పెట్రోల్, డీజిల్ వినియోగం జరుగుతుండగా, ప్రస్తుతం 1,88,210 కిలో లీటర్ల నిల్వలు సిద్ధంగా ఉన్నాయని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. *బ్లాక్ మార్కెట్పై నిఘా: 33 జిల్లాల్లోనూ గ్యాస్, పెట్రోల్ విక్రయాలను పర్యవేక్షించేందుకు నోడల్ అధికారులను నియమించామని, బ్లాక్ మార్కెట్కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. *ప్రాధాన్యత క్రమంలో సరఫరా: ఆసుపత్రులు, పాఠశాలలు, అనాథాశ్రమాలు మరియు వృద్ధాశ్రమాలకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల పంపిణీలో మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.అపోహలపై చర్యలు: ఇంధన కొరత ఉందంటూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తూ భయాందోళనలు కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం స్పష్టం చేశారు. గ్రీన్ ఎనర్జీ దిశగా అడుగులు: భవిష్యత్తులో శిలాజ ఇంధనాలపై ఆధారపడటం తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగాన్ని ప్రభుత్వం భారీగా ప్రోత్సహిస్తోందని సీఎం తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఈవీ వాహనాలపై 100% రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇచ్చారు.హైదరాబాద్లోని 1.20 లక్షల పాత ఆటోలను రిట్రోఫిట్టింగ్ ద్వారా ఈవీలుగా మార్చే ప్రక్రియ ప్రారంభించారు.ఆర్టీసీలో ఇకపై కేవలం ఈవీ బస్సులనే వినియోగించాలని నిర్ణయించారు.ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.