© 2026 SRS News. All rights reserved.
Developed by Abhiram

కామారెడ్డి: నూతన పరిశోధనలకు కామారెడ్డి సైన్స్ ఫెయిర్ వేదిక కావాలి... కామారెడ్డి లోని అబ్దుల్ కలాం ప్రాంగణం విద్యానికేతన్ హై స్కూల్ నందు నిర్వహిస్తున్నటువంటి ఇన్స్పైర్ మనక్ అవార్డ్స్ మరియు 53వ రాజ్యస్తరీయ బాల్ వైజ్ఞానిక్ ప్రదర్శిని ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ సందర్శించి సమీక్షించడమే కాక పలు సూచనలను సలహాలను ఇవ్వడం జరిగింది రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల నుండి 887 ప్రదర్శనలు సైన్స్ ఫెయిర్ కు రానున్న సందర్భంగా ఏడు సత్యంస్లో వారేగా వర్గీకరించి వాటికి రూములను కేటాయించి తగు ఏర్పాట్లను చేయడం జరిగింది. ప్రతి ఒక్క విభాగానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ మొత్తం 27 విభాగాలలో కమిటీలను ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా వస్తున్న విద్యార్థులకు ఉపాధ్యాయులకు విజ్ఞాన శాస్త్ర అభిమానులకు భావితరాల సైంటిస్టులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాట్లను సమీక్షించిన గౌరవ జిల్లా కలెక్టర్ విద్యార్థులకు ముఖ్యంగా మంచినీటి వసతిని మరియు భోజన వసతిని సౌకర్యవంతంగా ఉంచాలని భావిశాస్త్రవేత్తలకు అనుగుల మైనటువంటి వాతావరణాన్ని కల్పించడం ద్వారా వారిలో కొత్త ఆలోచనలను రేకే తెచ్చి రాబోవు తరాలకు సౌకర్యమంతమైనటువంటి పరిశోధనలు చేసే దిశగా వారి ఆలోచన దృక్పథాన్ని పెంపొందించేలా కృషి చేయాలని సూచించడం జరిగింది.ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమమే అయినప్పటికీ ప్రస్తుతం ఆధునికత రాకెట్ వేగంతో దూసుకుపోతున్న తరుణంలో నూతన ఆవిష్కరణల ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆ దిశగా కామారెడ్డి సైన్స్ ఫెయిర్ కేంద్ర బిందువు కావాలని సూచించడం జరిగింది.

కామారెడ్డి • 5 రోజుల క్రితం20

కామారెడ్డి • 6 రోజుల క్రితం34

కామారెడ్డి • 7 రోజుల క్రితం25

కామారెడ్డి • 7 రోజుల క్రితం8

కామారెడ్డి • 8 రోజుల క్రితం70