© 2026 SRS News. All rights reserved.
Developed by Abhiram
కామారెడ్డి: *కియాఘర్ పర్వతాధిరోహణకి బానోత్ వెన్నెలకు 5 లక్షల 50 వేల రూపాయల సహాయం అందించిన కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి * మాచారెడ్డి మండలం సోమారిపేట గ్రామానికి చెందిన బానోత్ వెన్నెల కియాఘర్ పర్వతాన్ని ఆదిరోహించడానికి వెళ్తున్న సందర్భంగాఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సన్మానం చేసి వీడ్కోలు పలికిన బిజెపి నాయకులు.ఈ సందర్భంగా వెన్నెల మాట్లాడుతూ మొదట తాను ఈ రంగంలో అడిగినప్పుడు గతంలో ఎమ్మెల్యే గా గెలవక ముందు 25 రూపాయల ఆర్థిక సహాయం చేశారని,తర్వాత దక్షణ ఆఫ్రికా దేశంలోని టాంజానియా లోని 5847 మీటర్ల ఎత్తు గల కిలిమంజారో నీ అధిరోహించడం జరిగిందనీ, ప్రస్తుతం హిమాలయాలను అధిరోహించే క్రమంలో శిక్షణలో భాగంగా ప్రస్తుతం లే లగ్ధాక్ లో ఉన్న 6100 మీటర్ల ఎత్తైన కియాఘర్ పర్వతాన్ని అధిరోహించేందుకు ఈ నెల 28 న లే లడ్డక్ నుండి ప్రారంభించనున్న సందర్భంగా కామారెడ్డి నుండి ప్రారంభం అయి కామారెడ్డి కి చేరుకునే వరకు అయ్యే ఖర్చు సుమారు 5 లక్షల 50 రూపాయలు తన చిన్ననాటి మిత్రులు అయినటువంటి డాక్టర్ విజయ్,ఆనంద్, డాక్టర్ దినేష్ రెడ్డి, డాక్టర్ రవీందర్ రెడ్డి, వ్యాపారవేత్త గబ్బుల శేఖర్ మరియు కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి అందరూ కలిసి ఇవ్వడం జరిగిందనీ వారికి కృతజ్ఞతలు తెలిపింది.బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ విపుల్ జైన్ మాట్లాడుతూ పర్వతాధిరోహణ కు బానోత్ వెన్నెల అడిగిన వెంటనే తన సొంత డబ్బులు 5 లక్షల 50 వేల రూపాయలు ఇవ్వడమే కాకుండా అన్ని రకాల సౌకర్యాల కల్పనలు కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి కృషి చేశారని, ఈ రకంగా కామారెడ్డి నియోజకవర్గానికి చెందిన యువత క్రీడలు, చదువులు,ఇతర రంగాల్లో నైపుణ్యం ప్రదర్శించిన వారికి తన వంతుగా సహాయ సహకారాలు అందించడంలో కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ముందుంటారని అన్నారు. ప్రతి ఒక్కరు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తూ కామారెడ్డి నియోజకవర్గం అన్ని రంగాల్లో ముధంజలో ఉండాలన్నదే KVR కళ అని అన్నారు.
Newకామారెడ్డి • సుమారు 21 గంటల క్రితం19

కామారెడ్డి • 6 రోజుల క్రితం34

కామారెడ్డి • 6 రోజుల క్రితం25

కామారెడ్డి • 4 రోజుల క్రితం23

కామారెడ్డి • 5 రోజుల క్రితం20